ఏపీలో స్కూళ్ల పునఃప్రారంభం మ‌ళ్లీ వాయిదా

ఏపీలో స్కూళ్ల పునఃప్రారంభం మ‌ళ్లీ వాయిదా

ఏపీలో అక్టోబరు 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. నవంబరు 2 వరకు స్కూళ్లు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా తీవ్రత కాస్త త‌గ్గినా.. కేసులు, మ‌ర‌ణాలు ఇంకా సంభ‌విస్తున్న నేప‌థ్యంలో ఈ మేరకు నిర్ణయించారు. అయితే పాఠశాలల ప్రారంభంతో సంబంధం లేకుండా జగనన్న విద్యాకానుక పథకాన్ని మాత్రం అక్టోబరు 5న ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొని సీఎం జగన్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని స‌మాచారం. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు జగనన్న విద్యా కిట్లు పంపిణీ చేయనున్నారు. ఈ కానుకలో పుస్తకాలు,యూనిఫాంలు, ఇతర స్టేషనరీ వస్తువులతో కూడిన ఓ కిట్ బ్యాగ్ ను విద్యార్థులకు అందిస్తారు జ‌గ‌న్.