కిరాయి భారం తగ్గించండి

కిరాయి భారం తగ్గించండి

బిజినెస్​ డెస్క్, వెలుగు:​ కొవిడ్​ దెబ్బకి విలవిలలాడుతున్న రిటెయిలర్లు, రెస్టారెంట్​ ఓనర్లు రెంట్ ​పేమెంట్ విధానం మార్చాల్సిందేనని మాల్స్​ యజమానులను డిమాండ్​ చేస్తున్నారు. పెర్​ఫార్మెన్స్​ బట్టి కిరాయి తీసుకోవాలని కోరుతున్నారు. ముంబై, ఢిల్లీలతోపాటు ఇతర నగరాలలో వారాల తరబడి లాక్​డౌన్​ కొనసాగుతుండటంతో రిటెయిలర్లు, రెస్టారెంట్ల బిజినెస్​ పడిపోయింది. రాబోయే కొన్ని నెలల్లో ఈ పరిస్థితులలో మార్పు వస్తుందనే ఆశలు కూడా వారిలో కనబడటం లేదు. ఈ నేపథ్యంలోనే ఆదిత్య బిర్లా, అరవింద్​ ఫ్యాషన్, లెవీస్​, బెనెటన్​​ సహా100 బ్రాండ్లు, ​సోషల్​ అండ్​ స్మోక్​ హౌస్​ డెలి వంటి రెస్టారెంట్లు రెవెన్యూ షేరింగ్​కు ఒప్పుకోమని మాల్స్​ ఓనర్స్​ను కోరాలని ఒక వీడియో కాన్ఫరెన్స్​లో డిసైడ్​ చేసుకున్నాయి. ఇందుకోసం విడివిడిగా మాల్​ ఓనర్లకు మెయిల్స్​ పంపాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పటిలా మినిమం రెంటల్​ గ్యారంటీ కూడా వుండొద్దని కోరుకుంటున్నాయి. లాక్​డౌన్​తో నష్టాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ భారాన్ని షేర్​ చేసుకోవడానికి ఏదో ఒక సరైన సొల్యూషన్​ వెతుక్కోవల్సిందేనని మదురా ఫ్యాషన్​ సీఈఓ విశాక్​ కుమార్​ చెప్పారు. ఇద్దరికీ అనువైన ఫార్ములా కోసమే మాల్స్​ ఓనర్లతో డిస్కస్​ చేస్తున్నట్లు పేర్కొన్నారు. లూయీస్​ ఫిలిప్​, వాన్​ హ్యూజెన్, అలెన్​ సోలీ, పీటర్​ ఇంగ్లాండ్​ వంటి బ్రాండ్స్​ను మదురా ఫ్యాషన్​ అమ్ముతోంది. నిజానికి అటు మాల్​ ఓనర్లకూ కోవిడ్​ పరిస్థితులు​ కష్టంగానే ఉన్నాయి. ఈ ఏడాది అనిశ్చితే ఉంటుంది. అందుకే, ఏడాది కాలానికి తగిన ఫార్ములా కావాలనుకుంటున్నామని కుమార్​ చెప్పారు. కానీ, మాల్స్​ ఓనర్లు మాత్రం ఇందుకు సిద్ధంగా లేరు. రిటెయిలర్లు, రెస్టారెంట్​ యజమానుల నుంచి ప్రపోజల్​ వచ్చిన మాట నిజమేనని, కాకపోతే వారు తొందరపడుతున్నారని ఒక మాల్​ టాప్​ ఎగ్జిక్యూటివ్​ వ్యాఖ్యానించారు. 
కిందటేడాది రెంట్లు తగ్గించారు..
ఢిల్లీలోని డీఎల్​ఎఫ్​ మాల్స్​, ముంబైలోని ఇన్ఫినిటీ మాల్స్​ సహా చాలా మాల్స్​ ఈ ప్రపోజల్​పై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఇలాంటి ప్రపోజల్స్​పై తొందర పడలేమని ముంబైలో ఇన్ఫినిటీ పేరిట రెండు మాల్స్​ నడుపుతున్న ముకేష్​ కుమార్​ చెప్పారు. రెండో వేవ్​ తొందరగానే ముగిసిపోతే ఒక రకంగా, మరి కొంత కాలం కొనసాగితే ఇంకో రకంగా సొల్యూషన్స్​ ఉండాలి. అందుకే మరి కొంత కాలం వెయిట్​ చేయాలని కుమార్​ సూచించారు. అసలు రెంట్​లో 25 శాతమే కట్టమని కిందటేడాది జూన్​లో  డీఎల్​ఎఫ్ మాల్​ కోరింది. ఆ తర్వాత జూలై నుంచి సెప్టెంబర్​ కాలానికి 50 శాతం, అక్టోబర్​–డిసెంబర్​ ​నెలలకు 75–80 శాతం రెంట్​ కట్టాలని రిటెయిలర్లను, రెస్టారెంట్​ ఓనర్లను డీఎల్​ఎఫ్​ మాల్​ కోరింది. ముంబైలోని మరో మాల్​ ఓనరయితే ఏప్రిల్​ 2020 నుంచి 2021 కాలానికి రెంట్​ను 35 శాతం తగ్గించేశారు. ఫస్ట్​ వేవ్​ దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే లైఫ్​స్టైల్​ బ్రాండ్స్​ బయటపడుతున్నాయి. కరోనా ఎఫెక్ట్​ ఈ రిటెయిల్​ సెగ్మెంట్​పైనే బాగా పడింది. కరోనా మహమ్మారి రావడానికి ముందున్న సేల్స్​లో 80–90 శాతం సేల్స్​ను ఇటీవలే ఈ సెగ్మెంట్​ 
అందుకోగలిగింది. 

2019ని బేస్​ ఇయర్​గా తీసుకోవాలి..
2019ని బేస్​ ఇయర్​గా తీసుకుని రెంటల్​ ఫార్ములా తీసుకురావాలని మాల్స్​ ఓనర్లను కోరినట్లు బెనెటన్​ ఇండియా సీఈఓ సందీప్​ ఛుగ్​ చెప్పారు. రిటెయిలర్ల వీడియో కాన్ఫరెన్స్​లో ఈయన కూడా పాల్గొన్నారు. మాల్స్​ యజమానుల నుంచి ఏమి కోరాలనే దానిపై ఏకాభిప్రాయం కోసమే వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించినట్లు పేర్కొన్నారు. మాల్స్​ యజమానులను మాత్రం తామందరూ విడివిడిగానే కోరుతున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఫస్ట్​ క్వార్టర్​లో అసలు వ్యాపారమే లేదు. దురదృష్టం కొద్దీ ఈ సంవత్సరమూ వైరస్​ దెబ్బతీసిందని  50 రెస్టారెంట్లు నడుపుతున్న ఇంప్రెజేరియో సీఈఓ రియాజ్​ అమ్లాని అన్నారు. బిజినెస్​ జరగడం లేదనే విషయాన్ని మాల్స్​ యజమానులకు పంపిస్తున్నామని అమ్లాని వెల్లడించారు. కరోనాకి ముందు మాల్స్​లో బిజినెస్ నెలకు​ రూ. 15 వేల కోట్లు. తాజా రెస్ట్రిక్షన్లు, లాక్​డౌన్స్​తో  మార్చి నుంచి ఇది 50 శాతం పడింది.