రూ.850 కోట్లు సేకరించిన నెఫ్రోప్లస్

రూ.850 కోట్లు సేకరించిన నెఫ్రోప్లస్

హైదరాబాద్, వెలుగు:  ప్రైవేట్ ఈక్విటీ సంస్థ క్వాడ్రియా క్యాపిటల్ డయాలసిస్ నెట్‌‌‌‌వర్క్ అయిన నెఫ్రోప్లస్‌‌‌‌లో రూ. 850 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు ప్రకటించింది. ఈ లావాదేవీ ద్వారా మైనారిటీ వాటాను పొందుతుంది. 2010లో ఏర్పాటైన నెఫ్రోప్లస్ ఇండియాతోపాటు ఫిలిప్పీన్స్,  ఇతర ఆసియా దేశాలలో వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపింది. ఈ కంపెనీ ప్రముఖ నెఫ్రాలజిస్ట్‌‌‌‌లతో పని చేస్తూ హాస్పిటల్స్, క్లినిక్‌‌‌‌లలో డయాలసిస్ సెంటర్లను నిర్వహిస్తోంది. 

 పట్టణ,  గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ-–ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా  సేవలు అందిస్తోంది. కంపెనీ టార్గెట్​ మార్కెట్‌‌‌‌లలో డయాలసిస్ సేవలకు డిమాండ్ వచ్చే ఐదేళ్లలో ఏటా 11 శాతం  పెరుగుతుందని అంచనా.  తమ బిజినెస్​వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇప్పటి వరకు 30 వేల మంది పేషెంట్లకు డయాలసిస్​ చేశామని నెఫ్రోప్లస్​ ఫౌండర్​విక్రమ్​వుప్పల చెప్పారు. సంస్థకు ఇండియాలో 250 ప్రాంతాల్లో 450 సెంటర్లు ఉన్నాయని వివరించారు.