న్యూఢిల్లీ: కంపెనీ సీఈఓ అభయ్ ఓఝాను పదవి నుంచి తీసేశామని జీ మీడియా కార్పొరేషన్ ప్రకటించింది. కానీ, కారణం చెప్పలేదు. సోమవారం జరిగిన బోర్డు మీటింగ్లో సీఈఓ పదవి నుంచి ఓఝాను తొలగించడానికి డైరెక్టర్లు ఆమోదం తెలిపారని జీ మీడియా రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చింది. ఓఝా కిందటేడాది కంపెనీ సీఈఓగా ప్రమోట్ అయ్యారు.
చీఫ్ బిజినెస్ ఆఫీసర్గా 2022 లో జీ మీడియాలో ఆయన జాయిన్ అయ్యారు. కిందటి నెల స్టార్టింగ్లో జీ మీడియా చీఫ్ మేనేజర్ పీయూష్ చౌదరి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జీ షేర్లు సోమవారం 5 శాతం పడిరూ.136 దగ్గర ముగిశాయి.