ధాన్యం కొనుగోళ్లు జరిపేలా ఇవాళ్టి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ కాలక్షేపం కబుర్లు కట్టిపెట్టి.. 24 గంటల్లో కొనుగోలు కేంద్రాలు తెరవాలని ట్వీట్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులను కూడగట్టి టీఆర్ఎస్ నేతలను గ్రామాలకు రాకుండా తరమికొడతామన్నారు రేవంత్. మద్ధతు ధరలకు ధాన్యం కొనుగోలు చేయాలని, రైతులకు లాభం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు రేవంత్.
వారం పాటు టీటీడీ బ్రేక్ దర్శనాలు రద్దు
పీఎన్బీ స్కామ్ కేసులో ప్రధాన సూత్రధారి అరెస్ట్
కేసీఆర్ కాలక్షేపం కబుర్లు కట్టిపెట్టి ధాన్యం కొనుగోళ్ల పై ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం చేయాలి.
— Revanth Reddy (@revanth_anumula) April 12, 2022
24 గంటల్లో కొనుగోలు కేంద్రాలు తెరవాలి….
లేనిపక్షంలో కాంగ్రెస్ సారథ్యంలో రైతులను కూడగట్టి టీఆర్ఎస్ నేతలను గ్రామాలకు రాకుండా తరిమికొడతాం.