మంత్రి కేటీఆర్కు రేవంత్ రెడ్డి సవాల్... 24 గంటల విద్యుత్ పై చర్చకు సిద్ధమా

మంత్రి కేటీఆర్కు రేవంత్ రెడ్డి సవాల్... 24 గంటల విద్యుత్ పై చర్చకు సిద్ధమా

రాష్ట్రంలో వ్యవసాయానికి  24 గంటల త్రీఫేజ్ కరెంట్ రావడం లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ట్రాన్స్ కో సీఎండీయే త్రీ ఫేజ్ కరెంట్ సరఫరాపై నియంత్రణ పాటిస్తున్నట్లు వెల్లడించినట్లు చెప్పారు. సీఎండీ ప్రభాకర్ రావే తాము 24 గంటల విద్యుత్ సింగిల్ ఫేజ్ కరెంట్ మాత్రమే ఇస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కేవలం 8 నుంచి 12 గంటల విద్యుత్ మాత్రమే వస్తోందన్నారు. 24 గంటల త్రీఫేజ్ కరెంట్ ఇస్తే రూ. 16 వేల కోట్లు ఖర్చు అవుతాయని..కానీ 24 గంటల కరెంట్ సరఫరా మీద కేసీఆర్. రూ. 8 నుంచి రూ. 9 వేల కోట్లు దోచేస్తున్నారని మండిపడ్డారు. 

ఉచిత కరెంట్ పై చర్చకు మంత్రి కేటీఆర్ సిద్ధమా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సిద్దిపేట, సిరిసిల్ల, చింతమడక, గజ్వేల్,  మంత్రి జగదీశ్వర్ రెడ్డి సొంత గ్రామం..ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా  రైతు వేదికలో 24 గంటల వ్యవసాయ విద్యుత్ సరఫరాపై మంత్రి కేటీఆర్ చర్చకు రావాలన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరాపై ప్రభుత్వాన్ని రైతులు ప్రశ్నించాలన్నారు. 9 ఏండ్ల ప్రభుత్వ పాలనపై అన్నదాతలు, ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు.  రాష్ట్రంలో థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం పేరు మీద 30 శాతం కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు.