రేపటి నుంచి జిల్లాల్లో పర్యటిస్తాం

రేపటి నుంచి జిల్లాల్లో పర్యటిస్తాం

రాష్ట్రంలో రైతులంతా రోడ్ల మీద ఉన్నారన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కామారెడ్డిలో ధాన్యం కుప్పపైనే రైతు ప్రాణాలు కోల్పోయిన ఘటన బాధాకరమన్నారు. ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై కార్యాచరణ చేశామన్నారు.  రేపటి నుంచి జిల్లాల్లో పర్యటిస్తామన్నారు.రైతులు వరి పండిస్తే ఉరి తీస్తామని ప్రభుత్వం బెదిరించే ప్రయత్నం చేస్తుందన్నారు.    ధాన్యం కొనం అనేంత దుర్మార్గం ఇంకోటి ఉండదన్నారు. చివరి గింజ వరకు సర్కార్ ధాన్యం కొనాల్సిందేనన్నారు. ఎన్నికలు ముగియగానే హుజురాబాద్ లో దళితబంధు ఇస్తానన్నా కేసీఆర్ ఇప్పటి వరకు పత్తాలేడన్నారు.