
మోడీ, కేసీఆర్ కలిసి రైతులకు ఉరి శిక్ష విధించారని ఫైర్ అయ్యారు.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. చివరి గింజ వరకు వడ్లను కోంటా అన్న కెసిఆర్ మాట మార్చారన్నారు. అంబర్ పేట్ పోలీస్ట్ స్టేషన్ నుంచి రిలీజ్ అయ్యక మాట్లాడారు రేవంత్. వరి వద్దు అని చెప్పిన కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో 150 ఎకరాల్లో వరి ఎందుకు సాగు చేస్తున్నారో చెప్పాలన్నారు. కేంద్రం ఏటా రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పి..ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. రైతులు, నిరుద్యోగల ఆత్మహత్యలకు మోడీ, కేసీఆరే కారణమన్నారు. వచ్చే నెల 4 వరకు కాంగ్రెస్ రచ్చ బండ కొనసాగుతుందన్నారు.