రాహుల్ ఇల్లు ఖాళీ చేసిన ఘటనపై రేవంత్ ట్వీట్

రాహుల్ ఇల్లు ఖాళీ చేసిన ఘటనపై రేవంత్ ట్వీట్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన అధికారిక భవనాన్ని ఖాళీ చేయడంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఆ దృశ్యాలను చూస్తే కండ్లలో నీళ్లు తిరిగాయని, గుండెలు బరువెక్కాయని ఆదివారం ట్వీట్ చేశారు. ‘‘గొప్ప కుటుంబ వారసత్వ చరిత్ర ఉండి, దేశానికి ఆస్తులను ధారపోసిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌పై బీజేపీ కక్షగట్టి అనర్హత వేటు వేసింది. అధికారిక నివాసాన్ని ఖాళీ చేయించి బయటకు పంపించింది.

ఆ సమయంలో రాహుల్ హుందాగా ప్రవర్తించారు. యువతకు ఆదర్శంగా నిలిచారు. ఇంటిని ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పజెప్పి బయటకు వెళ్లిన తీరుతో దేశ ఆత్మకు మరింత చేరువయ్యారు’’ అని పేర్కొన్నారు. రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని అక్రమంగా రద్దు చేశారని ఆరోపిస్తూ ఈ నెల 27న గాంధీ భవన్‌లో సత్యాగ్రహ దీక్ష చేపట్టన్నామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.