గుడిసెలు తొలగించిన రెవెన్యూ అధికారులు.. బాధితుల ఆందోళన

గుడిసెలు తొలగించిన రెవెన్యూ అధికారులు.. బాధితుల ఆందోళన

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని కొత్త కలెక్టరేట్ సమీపంలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా వెలిసిన గుడిసెలను రెవెన్యూ ఆధికారులు తొలగించారు. పేదలు వేసుకున్న గుడిసెలను జేసీబీతో నేలమట్టం చేశారు. ఈ క్రమంలో గుడిసెవాసులు జేసీబీని అడ్డుకుని నిరసన తెలిపారు.

ఈక్రమంలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో గుడిసెల బాధితులు వాగ్వివాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరింది.. ఘటనా స్థలంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగంలోకి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే గుడిసెవాసులు ఆందోళనకు దిగి.. జేసీబీని చుట్టుముట్టారు. అక్కడే బైటాయించిన తమ గుసెలు తొలగించడం అన్యాయం అంటూ నినాదించారు.