ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష

ఇంద్రకీలాద్రిపై బెజవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి వేడుకలు అక్టోబరు 15 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. 9 రోజుల పాటు వేడుకలు వైభవంగా నిర్వహించాలని వైదిక కమిటీ సభ్యులు నిర్ణయించారు. అక్టోబరు 15న ఉదయం అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహించి ఆ తర్వాత బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు. అనంతరం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు. మిగతా రోజుల్లో ఉదయం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.

 ఈ నెల 15 నుంచి ఇంద్రకీలాద్రిపై ప్రారంభం కానున్న దసరా ఉత్సవాల ఏర్పాట్ల పై అధికారులు సమీక్షించారు. ఈ సమీక్షలో ఎండోమెంట్ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, సీపీ కాంతిరాణా టాటా, డీసీపీ విశాల్ గున్ని, వీఎంసీ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్, ఈఓ భ్రమరాంబ, ఇతర అధికారులు పాల్గొన్నారు.  దసరాకి సంబంధించిన ఏర్పాట్లను పూర్తిగా పరిశీలించామని స్పెషల్ ఎండోమెంట్ సీఎస్ కరికాల్ వలవన్  తెలిపారు. క్యూలైన్లు, కేశఖండనశాల, కొబ్బరికాయలు కొట్టే ప్రదేశాలు, లడ్డు ప్రసాదాల కౌంటర్లు పరిశీలించామన్నారు.

క్యూలైన్లో ప్రతి 50 అడుగుల దూరానికి ఒక ఎగ్జిట్ పాయింట్ పెట్టామని.. చంటి పిల్లలకి పాలు, బిస్కెట్స్, వాటర్ ప్యాకెట్స్ ఏర్పాటు చేసామని తెలిపారు. అంచనాలకు మించి భక్తులు వచ్చినా.. ఎటువంటి ఇబ్బంది పడకుండా పక్కా ప్రణాళిక రూపకల్పన చేశామని పేర్కొన్నారు. దసరా నవరాత్రి ఉత్సవాలకు బడ్జెట్ గురించి ఆలోచించమని.. ఎంత ఖర్చైనా భక్తుల సౌకర్యం తమకు ముఖ్యమన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు కావలసిన సౌకర్యాల్ని ఏర్పాటు చేసామని  ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావ్ తెలిపారు. వీఐపీలకు టైం స్లాట్ లేదని... అంతరాలయ దర్శనం కేవలం వీఐపీలకు మాత్రమేనన్నారు. పార్కింగ్ కి సంబంధించి కూడా పుర్తిస్తాయిలో ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు.

ALSO READ : ఇండియాలో వివో మొబైల్ కంపెనీ ఉద్యోగుల అరెస్ట్