గుస్సాడీ కనక రాజుకు రివార్డు ప్రకటించిన సీఎం కేసీఆర్

గుస్సాడీ కనక రాజుకు రివార్డు ప్రకటించిన సీఎం కేసీఆర్

గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ కనక రాజుకు సీఎం కేసీఆర్ రివార్డు ప్రకటించారు. గత సంవత్సరం పద్మశ్రీ అవార్డు అందుకున్న కనకరాజుకు.. ఆయన సొంత జిల్లా కేంద్రంలో నివాసయోగ్యమైన ఇంటి స్థలంతో పాటు నిర్మాణం ఖర్చులకోసం 1 కోటి రూపాయలను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును ఆయన ఆదేశించారు.

అదేవిధంగా డోలువాయిద్య కళాకారుడు సకిని రామచంద్రయ్యకు కూడా రివార్డు ప్రకటించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, డోలువాయిద్యంలో ప్రత్యేక ప్రతిభను కనబరిచిన కళాకారుడు సకిని రామచంద్రయ్యకు ఆయన సొంత జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నివాసయోగ్యమైన ఇంటిస్థలంతో పాటు నిర్మాణ ఖర్చుకు రూ.1 కోటి రూపాయల రివార్డును ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇంటి జాగ, నిర్మాణానికి సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును సీఎం ఆదేశించారు.