దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడు. ఈ విషయాన్ని శనివారం తన ట్విటర్ లో తెలిపాడు . ఈ సినిమాలో భయంకరమైన నిజాలు చెప్పబోతున్నానని వర్మ వెల్లడించాడు.
‘దిశ అత్యాచారం, హత్య ఘటనల ఆధారంగా సినిమా చేయబోతున్నాను. ఆ సినిమాకు ‘దిశ’ అనే టైటిల్ను ఫిక్స్ చేశాం. ‘నిర్భయ’ అత్యాచారం తర్వాత అంతకంటే దారుణంగా ఓ ఆడపిల్లలను రేప్ చేసి సజీవదహనం చేశారు. దిశ ఘటన తర్వాత రేపిస్టులు ఏం నేర్చుకోలేదదు, వారి ఆగడాలు ఏ మాత్రం ఆగలేదు. ఆలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలో ఈ సినిమాలో చూపిస్తా, ప్రతీ విషయం క్షుణ్ణంగా చెబుతా”అని తన ట్విటర్ లో పేర్కొన్నాడు.
‘నిర్భయను అత్యాచారం చేసి రోడ్డు మీద వదిలివెళ్లారు. అలా చేస్తే శిక్ష పడదు అనుకున్నారు. కానీ పోలీసులకు చిక్కారు. అలాంటి పరిస్థితి తమకు రాకూడదని దిశను ఆ దోషులు కాల్చి చంపారు. నిర్భయ దోషులను ఈ రోజు ఉరి వేయాల్సింది. కానీ ఆ నిందితుల తరఫు (రాక్షస)న్యాయవాది ఏపీ సింగ్ పిటిషన్ వేసి ఉరిశిక్ష వాయిదా పడేలా చేశారు.. ‘దిశ’ లో నిందితులకు వేసే శిక్ష నా స్టైల్లో ఉంటుంది’ అంటూ వర్మ వరుస ట్వీట్లు చేశాడు.
My next film is titled “DISHA” which is going to be about the DISHA rape ..After the brutal rape and horrific murder of NIRBHAYA, the DISHA rapists went further in their ghastliness in actually burning the poor girl with petrol #DishaNirbhayaTruth pic.twitter.com/3SiiesIgR8
— Ram Gopal Varma (@RGVzoomin) February 1, 2020
My film DISHA will expose a scary lesson to all of us that the rapists are trying to learn from the mistakes of previous rapists but they are not stopping the rapes #DishaNirbhayaTruth pic.twitter.com/SAUSbf6qSB
— Ram Gopal Varma (@RGVzoomin) February 1, 2020