హైదరాబాద్ బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్పై అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన విదితమే. ఈ ఘటన తాలూకూ వివరాలను పోలీసులు వెల్లడించారు. ఓవర్ స్పీడే అతని మృతికి కారణమని పోలీసులు నిర్ధారించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలికి చెందిన మధు(25) జులై 23 అర్ధరాత్రి స్పోర్ట్స్ బైక్ డ్రైవ్ చేస్తూ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైకి వెళ్లాడు.
అప్పటికే వేగం మీదున్న అతని బైక్ ఫ్లైఓవర్ టర్నింగ్ దగ్గరికి రాగానే అదుపుతప్పి డివైడర్ని ఢీ కొట్టింది. దీంతో బైక్ డ్రైవ్ చేస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని హాస్పిటల్కి తరలించారు. ఓవర్స్పీడే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. యువత వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని.. హెల్మెట్లు ధరించాలని వారు సూచిస్తున్నారు.