ఓవర్​ స్పీడ్​ డ్రైవింగ్..​ ఆ యువకుడి ప్రాణాలు తీసింది

ఓవర్​ స్పీడ్​ డ్రైవింగ్..​ ఆ యువకుడి ప్రాణాలు తీసింది

హైదరాబాద్​ బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్​పై అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు  ప్రాణాలు కోల్పోయిన ఘటన విదితమే. ఈ ఘటన తాలూకూ వివరాలను పోలీసులు వెల్లడించారు. ఓవర్​ స్పీడే అతని మృతికి కారణమని పోలీసులు నిర్ధారించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలికి చెందిన మధు(25) జులై 23 అర్ధరాత్రి స్పోర్ట్స్​ బైక్ డ్రైవ్​ చేస్తూ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్​ పైకి వెళ్లాడు. 

అప్పటికే వేగం మీదున్న అతని బైక్ ఫ్లైఓవర్​ టర్నింగ్ దగ్గరికి రాగానే అదుపుతప్పి డివైడర్​ని ఢీ కొట్టింది. దీంతో బైక్​ డ్రైవ్​ చేస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 

సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని హాస్పిటల్​కి తరలించారు. ఓవర్​స్పీడే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. యువత వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని.. హెల్మెట్లు ధరించాలని వారు సూచిస్తున్నారు.