నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురి మృతి

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురి మృతి

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోగా..మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి దేవరకొండ వైపు వస్తున్న బొలెరో వాహనం… నాగార్జున సాగర్ హైవేపై  కొండమల్లె పల్లి మండలం చెన్నారం దగ్గరకు రాగానే టైర్ పేలిపోయింది. దీంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ఉన్న 7మృతి చెందగా.. బస్సులోఉన్న 15మందికి గాయాలయ్యాయి. దేవరకొండ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ వెళ్తుంది. గాయపడిన వారిని  వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.