కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో చోరీ

కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో చోరీ

మేడ్చల్ జిల్లా: కుత్బుల్లాపూర్ సురారం లక్ష్మీనగర్ కాలనీలోని కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి ఆలయం తాళాలు పగలగొట్టి ఆరు పంచలోహ విగ్రహాలు ఎత్తుకెళ్లారు దొంగలు. తెల్లవారుజామున చోరీ జరిగిన విషయాన్ని గమినించిన అర్చకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయాన్ని పరిశీలించారు పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వారు చెప్పారు.