![ప్రధాని మోదీపై పిటిషన్... తిరస్కరించిన సుప్రీంకోర్టు](https://static.v6velugu.com/uploads/2024/05/supreme-court-refuses-to-entertain-plea-to-disqualify-pm-modi-from-elections_hm7onLQrUp.jpg)
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎన్నికల్లో పోటీలో పాల్గొనకుండా అనర్హత ఓటు వేయాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు మే14వ తేదీ మంగళవారం నిరాకరించింది. దేవుడు, మందిరాల పేరుతో మోదీ ఓట్లు అడిగారని.. ఆయన ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని కోరుతూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
అయితే విక్రమ్ నాథ్ , సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం మొదట పిటిషనర్ ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలని సూచించింది. దీంతో పిటిషనర్ ఆ పిటిషన్ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. మతం పేరుతో ఓట్లు వేయించుకోవడం అనేది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించడమే అవుతుందంటూ మోదీపై చర్య తీసుకోవాలని ఫాతిమా అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు.