
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్(Boney Kapoor) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆడియన్స్ కి ఆర్ఆర్ఆర్(RRR), పఠాన్(Pathaan), జవాన్(jawan) లాంటి సినిమాలు కావాలనే. యాక్షన్ సినిమాలనే ఇష్టపడతారని, మైదాన్ లాంటి గొప్ప సినిమాను ఆదరించలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ నిర్మించిన తాజా చిత్రం మైదాన్. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ హీరోగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు అమిత్ శర్మ తెరకెక్కించాడు. టీజర్, ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాను ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. దాంతో మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. దయతో ఏ చిత్ర నిర్మాత షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బోనీ కపూర్ మాటాడుతూ.. మైదాన్ సినిమా కథ అద్భుతమైనది. హీరో అజయ్ దేవగణ్ కూడా అద్భుతంగా నటించారు. కానీ, ఆయన నుండి ప్రేక్షకుల ఎం డిమాండ్స్ చేస్తున్నారు అనేది మాత్రం మేము ఆలోచించలేదు. ఇప్పటి ఆడియన్స్ కి కావాల్సింది RRR, జవాన్, పఠాన్ లాంటి యాక్షన్ సినిమాలు. అందుకే మైదాన్ లాంటి సినిమాలకు ఆధరణ రావడం లేదు.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ఏ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.