కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు కరోనా సోకింది. దీంతో ప్రియాంక సెల్ఫ్ ఐసోలేషన్కి వెళ్లారు. తన భర్త రాబర్ట్కు కరోనా పాజిటివ్గా నిర్థారణైందని.. తాను కరోనా పరిక్షలు చేయించుకోగా నెగిటివ్ వచ్చిందని తెలిపారు ప్రియాంక. డాక్టర్ల సూచనలతో కొన్ని రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్తున్నట్లు ఓ వీడియో మెసేజ్ తో ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న ప్రియాంక గాంధీ ఇవాళ అస్సాంలో చేపట్టాల్సిన ఎన్నికల పర్యటనను రద్దు చేసుకున్నారు. శనివారం తమిళనాడు, ఆదివారం కేరళలో పర్యటించాల్సి వుంది. అయితే కరోనా కారణంగా ఎన్నికల ప్రచారానికి రాలేకపోతున్నానని.. ప్రతి ఒక్కరినీ క్షమాపణ కోరుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ గెలుపు కోసం ప్రార్థిన చేస్తున్నట్లు ఆ వీడియోలో చెప్పారు.