వచ్చేనెలలో సొంతగడ్డపై వెస్టిండీస్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులోకి రానున్నాడు. ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు మూడు వన్డేలు, టీ20 మ్యాచ్ల్లో భారత్.. విండీస్ తలపడనున్నాయి. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు నెట్ ప్రాక్టీసులో రోహిత్కు తొడ కండరాల గాయమైంది. దీంతో అతను సఫారీ పర్యటనకు దూరమయ్యాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో రోహిత్ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడని బీసీసీఐ అధికారులు తెలిపారు. విండీస్తో సిరీస్కు అతను పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశముందని ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని వార్తల కోసం..