
గువహతి వేదికగా జరుగుతోన్న భారత్, శ్రీలంక తొలి వన్డే మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ మిస్ అయ్యాడు. 67 బంతులను ఎదురుకున్న రోహిత్ 83 పరుగులు చేసి దిల్షన్ మదుశంక బౌలింగ్ లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. దీంతో 173 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ను కోల్పోయింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కుదిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ(83), శుభ్మన్ గిల్ (70) మంచి శుభరాంభాన్ని ఇచ్చారు. నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. తొలి వికెట్కు 143 పరుగుల భాగస్వామ్యానికి నెలకొల్పారు. 19 ఓవర్లో వీరి జోడీకి తెరపడింది. డాసున్ శనక బౌలింగ్లో గిల్ఎల్బీగా ఔటయ్యాడు.
కాగా ప్రస్తుతం 24 ఓవర్లకు టీమిండియా 2 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(24), శ్రేయాస్ అయ్యర్ (6) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.