నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్తో భారత్కు అంతర్జాతీయ టీ20 సిరీస్ జరగనుంది. దాని కోసం టీమిండియా ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలు పెట్టింది. భారత్లోనే మ్యాచ్లు జరగనున్నాయి. న్యూజిలాండ్ సిరీస్ కోసం బీసీసీఐ తాజాగా టీమిండియా జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లీ ఇప్పటికే అంతర్జాతీయ టీ20 మ్యాచ్లకు కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పుకోవడంతో.. రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇక వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు. మొత్తం 16 సభ్యుల టీమ్ను బీసీసీఐ తాజాగా ప్రకటించింది.
అయితే.. న్యూజిలాండ్ సిరీస్లో విరాట్ కోహ్లీకి పూర్తిగా రెస్ట్ ఇచ్చారు. ఈ సిరీస్లో కోహ్లీ ఆడటం లేదు.
టీమిండియా జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, వెంకటేశ్ అయ్యర్, యజువేంద్ర చహల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్.