టీఎస్ఆర్టీసీ బస్సులో థియేటర్ కు RRR టీమ్

టీఎస్ఆర్టీసీ బస్సులో థియేటర్ కు RRR టీమ్

హైదరాబాద్: ఈ రోజు రిలీజైన RRR మూవీ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఏ థియేటర్ ముందు చూసిన హౌజ్ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఇక పోతే RRR టీమ్  టీఎస్ ఆర్టీసీ బస్సులో  ప్రయాణించింది. టీఎస్ఆర్టీసీని ప్రమోట్ చేసేందుకు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఈ చొరవ తీసుకున్నారు. RRR టీమ్ తో మాట్లాడి వారికోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సుల్లో  ప్రయాణించిన రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, తదితరులు... కూకట్పల్లిలోని భ్రమరాంబ థియేటర్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సజ్జనార్ RRR టీమ్కు థ్యాంక్స్ చెప్పారు. కాగా RRR బృందం కూడా  టీఎస్ఆర్టీసీకి కృతజ్ఞతలు తెలిపింది. 
 

మరిన్ని వార్తల కోసం...

RRR షో రద్దైందని రచ్చ రచ్చ

RRR రివ్యూ: ఎవ్వరూ తగ్గలే!