శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్‌  విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్‌  విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. డిసెంబర్ 11వ తేదీ సోమవారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో దబాయ్ నుంచి వచ్చి ఓ ప్రయాణికురాలిని తనిఖీ చేయగా.. ఆమె వద్ద 449 గ్రాముల బంగారాన్ని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మహిళను అదుపులోకి తీసుకున్నారు. 

మార్కెట్ స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు రూ.28 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.