రూ.30 కోట్ల హెలికాప్టర్ రూ.4 కోట్లకే

రూ.30 కోట్ల హెలికాప్టర్  రూ.4 కోట్లకే

అత్యంత ఖరీదైన, అన్ని భద్రతా సదుపాయాలున్న హెలికాప్టర్ ను రాజస్థాన్ అమ్మేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 12 సార్లు టెండర్లను పిలిచినా కొనేందుకు ఎవరూ రాలేదు. దీంతో ఏకంగా రూ. 26 కోట్ల డిస్కౌంట్ ఇస్తూ.. కేవలం రూ. 4 కోట్లకే అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాజస్థాన్ సీఎంగా వసుంధరా రాజే ఉన్నసమయంలో ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్ లాండ్ కంపెనీకి చెందిన ట్విన్ ఇంజిన్ 109 హెలికాప్టర్ ను రూ. 30 కోట్లతో కొనుగోలు చేశారు. అధికార కార్యక్రమాలకు ఆమె ఈ హెలికాప్టర్ ను వినియోగించారు. అయితే అశోక్ గెహ్లాట్ సీఎం అయిన తర్వాత ఓ కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో హెలికాప్టర్ ను అత్యవసరంగా దించేశారు. అప్పటి నుంచి ఈ హెలికాప్టర్ ను ఎవరూ వినియోగించలేదు. దీంతో అప్పటి నుంచి అది గోడౌన్ లో వృథాగా పడి ఉంది. ఈ క్రమంలోనే ఆ హెలికాప్టర్ ను అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.