కేసీఆర్ కుటుంబం దోచుకున్న డబ్బులు కక్కించి, జైలుకి పంపిస్తాం : రాజగోపాల్ రెడ్డి

కేసీఆర్ కుటుంబం దోచుకున్న డబ్బులు కక్కించి, జైలుకి పంపిస్తాం : రాజగోపాల్ రెడ్డి

బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఫైర్ అయ్యారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం దోచుకున్న డబ్బులు కక్కించి, జైలుకి పంపిస్తామని అన్నారు. రానున్న బతుకమ్మ పండుగ కవిత జైల్లో ఆడవాల్సి వచ్చిందని చెప్పారు. బిడ్డ జైలు శిక్ష అనుభవిస్తున్న ఏ ముఖం పేట్టుకొని కేసీఆర్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రచారాన్ని చూసి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రచారం చెయ్యకుండా ఇంటి దగ్గర ఉండాలని హితవు పలికారు.

 నల్లగొండ జిల్లా చిట్యాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కాంగ్రెస్ మెజారిటీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలతో కాదని, నకిరేకల్ మునుగోడు ప్రజల మధ్య పోటీ అని అన్నారు. నకిరేకల్ అభివృద్ధి కోసం పంచ పాండవులగా ఎమ్మెల్యే లు, మంత్రి , ముఖ్యమంత్రి పని చేస్తామని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.