దేశవ్యాప్తంగా పిన్న వయస్సులోనే తిరువనంతపురం మేయర్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆర్య రాజేంద్రన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆమె .. తన భర్త సచిన్ దేవ్... కెఎస్ఆర్టిసి బస్సు డ్రైవర్ తో గొడవ పడ్డారు. ఈ విషయం కేరళ రవాణా శాఖా మంత్రి కెబి గణేష్ కుమార్కు విన్నవించగా.. కేసు విచారణ పూర్తయ్యేంతవరకు విధులకు దూరంగా ఉండాలని బస్సు డ్రైవర్ ను ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే.....
తిరువనంతపురం మేయర్-ఎమ్మెల్యే దంపతులు, కొంతమంది బంధువులతో కలిసి కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (KSRTC) బస్సు డ్రైవర్ ఎల్హెచ్ యాధు పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేయడమే కాకుండా.. వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ( లైంగిక చర్యలు ప్రేరేపించే విధంగా సైగలతో) మేయర్ ఆర్య రాజేంద్రన్ మరియు ఆమె కోడలు ఆరోపించారు. ఈ విషయంలో డ్రైవర్ కు, మేయర్ దంపతులకు మధ్య వాగ్వాదం జరిగింది. తన కారు వెళ్లేందుకు స్థలం ఇవ్వలేదని ఆరోపిస్తూ కేఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్పై మేయర్ ఆర్య రాజేంద్రన్ గొడవకు దిగినట్లు తెలుస్తోంది.
డ్రైవర్ యాధుపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో .. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాధు తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఈ ఘటనలో బస్సు గంట పాటు ఆలస్యం కావడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మేయర్, ఎమ్మెల్యే, ఇతరులు విధులకు ఆటంకం కలిగిస్తున్నారని డ్రైవర్ ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదు.అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో మేయర్, ఎమ్మెల్యే దంపతులపై విమర్శలు వచ్చాయి. KSRTC డ్రైవర్ పై ఫిర్యాదు చేసి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినందుకు నెటిజన్లు తప్పుపడుతున్నారు. అయితే మేయర్ దంపతులు బస్సును అడ్డుకోలేదని.. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు బస్సు డ్రైవర్ తో మాట్లాడామన్నారు. దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ పరిశీలించగా మేయర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు తేలింది. .
మేయర్ తాము బస్సును అడ్డుకోలేదని, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బస్సు ఆగినప్పుడు డ్రైవర్తో మాత్రమే మాట్లాడామని సమర్థించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో మేయర్ వెర్షన్ అవాస్తవమని తేలింది.అయితే మేయర్ ఈ విషయాన్ని కేరళ రవాణా శాఖ మంత్రి కెబి గణేష్ కుమార్కు ఫిర్యాదు చేయగా... కేసు విచారణ పెండింగ్ లో ఉన్నందున డ్రైవర్ యాధును విధులక దూరంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. మేయర్-ఎమ్మెల్యే దంపతుల చర్యను సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకత్వం సమర్థించుకుంది. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ మాట్లాడుతూ బస్సు డ్రైవర్ చేసిన అభ్యంతరకర చర్యలు, హావభావాలు లైంగిక చర్యలు ప్రోత్సహించే విధంగానే ఉన్నాయన్నారు.