పిట్లం, వెలుగు : రాష్ట్రస్థాయి అబాకస్, వేదిక్మ్యాథ్స్ పోటీలకు పిట్లం బ్లూబెల్స్ హైస్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. ఆదివారం కామారెడ్డిలో విశ్వం ఎడ్యకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జోనల్స్థాయి అబాకస్, వేదిక్ మ్యాథ్స్ పోటీల్లో బ్లూబెల్స్స్కూల్ నుంచి 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఇందులో అబాకస్లో మనస్విని, అఫ్సన్ ఖాన్, శివాని విజయం సాధించగా, వేదిక్ మ్యాథ్స్లో మనస్విని, ఖుషి, సరస్వతి, మధులిక ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు స్కూల్ ప్రిన్సిపాల్సంజీవరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆయన స్కూల్ టీచర్ దేవాగౌడ్తో కలిసి అభినందించారు.
