కేసీఆర్ స్పీచ్ను మోదీ నకల్ కొట్టిండు: సీఎం రేవంత్

కేసీఆర్ స్పీచ్ను మోదీ నకల్ కొట్టిండు: సీఎం రేవంత్


ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జహిరాబాద్ లో  కేసీఆర్ స్పీచ్ ను మోదీ కాపీ కొట్టారు తప్ప..కొత్తదనం ఏమీ లేదన్నారు.  తనను తిడితే మోదీకి ఏం వస్తుందని ప్రశ్నించారు. మోదీ ఢిల్లీ నుంచి వచ్చి బెదిరిస్తే  భయపడనన్నారు రేవంత్ . హైదరాబాద్  బాలాపూర్ లో నిర్వహించిన   రోడ్ షోలో రేవంత్ మాట్లాడారు ..  పాలమూరు ఎత్తిపోతల పథకం,ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మోదీ ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. తెలంగాణకు మోదీ ఏమిస్తారో ఒక్క మాట కూడా చెప్పలేదన్నారు.  

మోదీ అన్ని రకాలుగా తెలంగాణను మోసం చేశారని విమర్శించారు రేవంత్. పేదల అకౌంట్లో  15 లక్షలిస్తానని ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు.యువతకు ఉద్యోగాలివ్వకుండా రోడ్డున పడేశారని విమర్శించారు.  కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజకీయాలను కూడా వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. డ్రగ్స్ మూలాలన్నీ గుజరాత్ లోనే ఉన్నాయని ఆరోపించారు. మోదీని గద్దె దించే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు నిష్క్రమించబోరని హెచ్చరించారు.

 కేసీఆర్ మళ్లీ జీవితంలో సీఎం కాలేరని అన్నారు  రేవంత్ రెడ్డి. పదేళ్లలో ఏం చేసిండో కేసీఆర్ చెప్పడం లేదన్నారు. సంకీర్ణంలో నామానాగేశ్వర్ రావు కేంద్రమంత్రి అయితాడో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. పిల్లల బలిదానాలతో తాను అధికారంలోకి రాలేదని చెప్పారు రేవంత్.