పెట్టుబడుల పేరుతో మోసం.. రూ.32 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

పెట్టుబడుల పేరుతో మోసం.. రూ.32 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

బషీర్​బాగ్, వెలుగు: ఆన్ లైన్​లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి ఓ వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు భారీగా డబ్బు కొట్టేశారు. సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన ఓ వ్యక్తికి ఆన్ లైన్ లో పెట్టుబడులు పెట్టాలంటూ సైబర్ నేరగాళ్లు టెలిగ్రామ్​లో మెసేజ్ లు పంపారు.

మొదట కొంత డబ్బు ఇన్వెస్ట్ చేయగా.. లాభాలు చూపించి నమ్మించారు. ఆ తర్వాత వివిధ టాస్క్ లు ఇచ్చి.. 3 నెలల్లో విడతల వారీగా బాధితుడి నుంచి రూ.32 లక్షలు కాజేశారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు.