తెలంగాణలో విస్తృతంగా తనిఖీలు.. రూ. 639 కోట్లు పట్టుకున్న పోలీసులు

తెలంగాణలో విస్తృతంగా తనిఖీలు..  రూ. 639 కోట్లు పట్టుకున్న పోలీసులు

రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు రూ. 639 కోట్ల విలువైన సొమ్మును పోలీస్ అధికారులు పట్టుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ. 239 కోట్ల నగదును సీజ్ చేశారు. 

రూ. 103 కోట్ల విలువచేసే అక్రమ మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 35 కోట్ల విలువైన మత్తుపదార్థాలు సీజ్ చేశారు. రూ. 181 కోట్ల విలువైన బంగారం, వెండి, వజ్రాలు.. రూ.79 కోట్లు విలువ చేసే కుక్కర్లు, చీరెలు, క్రీడా సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.