డ్రైవర్ నిర్లక్ష్యం.. పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

డ్రైవర్ నిర్లక్ష్యం.. పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని  టిప్పుఖాన్  బ్రిడ్జ్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది.  హైదర్ షా కోట్ వద్ద రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ఉండగా.. వారిలో 15 మందికి తీవ్ర గాయలయ్యాయి. బస్సు అద్దాలను పగలుకొట్టుకుని ప్రయాణికులు బయటకు వచ్చారు. బస్సు ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు  గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. 

డ్రైవర్ అజాగ్రత్త, మితిమీరిన వేగం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్ చేతికి ముందే గాయం ఉందని అయినా అతను నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశాడని అంటున్నాడు. ఎదురుగా కారు రావడంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో బస్సు పొదల్లోకి దూసుకెళ్లిందని చెబుతున్నారు.