ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేస్తే..హిస్టరీ షీట్ ​తెరుస్తాం

ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేస్తే..హిస్టరీ షీట్ ​తెరుస్తాం
  •     ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు : విధుల్లో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేయడం క్షమించరాని నేరమని, ఏ మాత్రం సహించబోమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. పోలీస్​శాఖ సహకారంతో హిస్టరీ షీట్స్​తెరుస్తామని చెప్పారు.

బస్సు డ్యామేజీ ఖర్చులను నిందితుల నుంచే వసూలు చేస్తామన్నారు. దాడిచేసిన వారికి ఐపీసీ 353 సెక్షన్​ప్రకారం రెండు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) వేదికగా హెచ్చరించారు.