- ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు : విధుల్లో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేయడం క్షమించరాని నేరమని, ఏ మాత్రం సహించబోమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. పోలీస్శాఖ సహకారంతో హిస్టరీ షీట్స్తెరుస్తామని చెప్పారు.
బస్సు డ్యామేజీ ఖర్చులను నిందితుల నుంచే వసూలు చేస్తామన్నారు. దాడిచేసిన వారికి ఐపీసీ 353 సెక్షన్ప్రకారం రెండు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) వేదికగా హెచ్చరించారు.