
- సీఎంవో స్పెషల్ సెక్రటరీకి ఆర్టీసీ యూనియన్ల వినతి
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం సీఎంవో స్పెషల్సెక్రటరీ శ్రీనివాస్రాజుకు ఆర్టీసీ యూనియన్ నాయకులు రాజిరెడ్డి, అబ్రహం, జక్రయ్య, జయ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలకు సంబంధించి 4 వినతి పత్రాలు అందించినట్టు తెలిపారు.
ఆర్టీసీ ద్వారా ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తే సబ్సిడీని ఆర్టీసీకి ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని ఆర్టీసీకి ఇస్తే డ్రైవర్లు, గ్యారేజీ సిబ్బంది, మెకానిక్లకు ఉద్యోగ భద్రత ఉంటుందని తెలిపారు. ఆర్టీసీలో ప్రైవేట్ ఏజెన్సీలు, ఔట్ సోర్సింగ్ ద్వారా కండక్టర్లు, డ్రైవర్ల నియామకాల ప్రక్రియను నిలిపేయాలన్నారు. దీనిపై ఆర్టీసీ కార్మికులతోపాటు నిరుద్యోగుల్లో వ్యతిరేకత వస్తుందన్నారు.