తెలంగాణలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు

తెలంగాణలో  ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు

తెలంగాణలో సద్దుల బతుకమ్మ సంబురాలు వైభవంగా జరిగాయి. ఆఖరి రోజు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, ఒక్కచోటికి చేరి ఆడిపాడారు మహిళలు. సద్దుల బతుకమ్మ సంబురాలు సిద్దిపేట జిల్లాలో ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి హరీష్ రావు సతీమణి శ్రీనిత ఆడిపాడారు.  

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ వేడుకల్లో మంత్రి జగదీశ్ రెడ్డి సతీమణి గుండ్లకండ్ల సునీత తోపాటు.. పలువురు మహిళలు పాల్గొన్నారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మ అందంగా పేర్చారు మహిళలు.  

వరంగల్ నగరంలో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. పద్మాక్షమ్మ టెంపుల్ దగ్గరకు భారీగా తరలివచ్చారు మహిళలు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు ఆడిపాడారు.  

కరీంనగర్ గంజ్ సర్కిల్ దగ్గర సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆటపాటలతో మహిళలు సందడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు వైభవంగా జరిగాయి. చివరిరోజు బతుకమ్మకు ఘనంగా వీడ్కోలు పలికారు మహిళలు.