సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ.. ఆమిర్ ఖాన్ తనయుడితో రొమాన్స్?

సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ.. ఆమిర్ ఖాన్ తనయుడితో రొమాన్స్?

సౌత్ బ్యూటీ సాయిపల్లవి(Sai pallavi) బాలీవుడ్​ బాట పట్టనుందా? అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆమె బాలీవుడ్ ఎంట్రీపై చాలా కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా మరోసారి సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీకి సంబందించిన సాలిడ్​ న్యూస్ ఒకటి ​ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

బాలీవుడ్​ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్​ ఖాన్​ తనయుడు జునైద్​ ఖాన్​ త్వరలోనే హీరోగా పరిచయం కానున్నాడు. ఈ సినిమాలో జునైద్​కు జోడీగా సాయి పల్లవిని ఫిక్స్​ చేసినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. సునీల్ పాండే ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. సాయి పల్లవి మాములు కమర్షియల్ సినిమాలు చేయడానికి పెద్దగా ఇష్టపడరు. ఆమె ఒక స్టోరీనీ సెలెక్ట్ చేసిందంటే.. అందులో పక్కాగా ఎదో ఒక విశేషం ఉండే ఉంటుంది. అంతేకాదు ఆ ప్రాజెక్టు వచ్చే హైప్​ కూడా నెక్స్ట్ లెవల్లో ఉంటుంది.

Also Read :- ఒకే రూములో ఇద్దరు మరదళ్ల ముద్దుల బావ.. వైరల్ అవుతున్న డ్యాన్స్ వీడియో

ఇక ఆమె తెలుగులో చివరగా రానా హీరోగా వచ్చిన విరాటపర్వం సినిమాలో కనిపించారు. ఇప్పుడు చాలా గ్యాప్​ తరువాత బాలీవుడ్ స్టోరీకి ఒకే చెప్పిందంటే.. ఆ సినిమాలో ఎదో విశేషం ఉండే ఉంటుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకైతే ఇది రూమర్ గానే ఉంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.