వరంగల్‌లో రాజు అంత్యక్రియలు పూర్తి

వరంగల్‌లో రాజు అంత్యక్రియలు పూర్తి

సైదాబాద్ చిన్నారి ఘటన నిందితుడు రాజు మృతదేహానికి వరంగల్ లోనే అంత్యక్రియలు నిర్వహించారు. పోతన నగర్ లోని స్మశాన వాటికలో  రాజు అంత్యక్రియలు పూర్తి చేశారు. రాజు మృతదేహానికి వరంగల్ ఎంజీఎంలో పోస్టుమార్టం పూర్తి అయింది. డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. అయితే రోజు సొంతూరు అడ్డగూడూరులో అంత్యక్రియలు నిర్వహించాలని భావించారు. కానీ రైల్వే పోలీసులు రాజు కుటుంబ సభ్యులతో మాట్లాడి వరంగల్ లో అంత్యక్రియలు జరిగేలా ఒప్పించారు. ఇవాళ ఉదయం స్టేషన్ ఘన్ పూర్ దగ్గర్లోని రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నాడు రాజు.