ఏఎస్‌‌ఆర్‌‌టీయూ స్టాండింగ్​ కమిటీ చైర్మన్​గా సజ్జనార్

ఏఎస్‌‌ఆర్‌‌టీయూ స్టాండింగ్​ కమిటీ చైర్మన్​గా సజ్జనార్

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అసోసియేషన్‌‌ ఆఫ్‌‌ స్టేట్‌‌ రోడ్డు ట్రాన్స్‌‌పోర్ట్‌‌ అండర్‌‌టేకింగ్స్‌‌ (ఏఎస్‌‌ఆర్‌‌టీయూ) స్టాండింగ్ కమిటీ  చైర్మన్ గా టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎన్నికయ్యారు. ఢిల్లీలోని ఇండియా హబిటెంట్ సెంటర్​లో  ఏఎస్‌‌ఆర్‌‌టీయూ 54వ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఇందులో  పాల్గొన్న దేశంలోని ఆర్టీసీల ఎండీలు స్టాండింగ్ కమిటీని ఎన్నుకున్నారు. చైర్మన్ గా సజ్జనార్​ను  ఏకగ్రీవం చేశారు. 

ఈ పదవిలో ఆయన ఏడాది పాటు కొనసాగుతారని ఏఎస్‌‌ఆర్‌‌టీయూ ప్రకటించింది. అలాగే స్టాండింగ్ కమిటీ మెంబర్​గా టీఎస్​ ఆర్టీసీ చీఫ్ మెకానిక్ ఇంజినీర్ రఘునాథరావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సజ్జనార్​ను ఏఎస్ఆర్టీయూ వైస్ ప్రెసిడెంట్, ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావుతోపాటు ఇతర రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు అభినందించారు.  తనను ఎన్నుకున్న ఆర్టీసీల ఎండీలకు సజ్జనార్​ థ్యాంక్స్ చెప్పారు.