హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎన్నికయ్యారు. ఢిల్లీలోని ఇండియా హబిటెంట్ సెంటర్లో ఏఎస్ఆర్టీయూ 54వ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఇందులో పాల్గొన్న దేశంలోని ఆర్టీసీల ఎండీలు స్టాండింగ్ కమిటీని ఎన్నుకున్నారు. చైర్మన్ గా సజ్జనార్ను ఏకగ్రీవం చేశారు.
ఈ పదవిలో ఆయన ఏడాది పాటు కొనసాగుతారని ఏఎస్ఆర్టీయూ ప్రకటించింది. అలాగే స్టాండింగ్ కమిటీ మెంబర్గా టీఎస్ ఆర్టీసీ చీఫ్ మెకానిక్ ఇంజినీర్ రఘునాథరావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సజ్జనార్ను ఏఎస్ఆర్టీయూ వైస్ ప్రెసిడెంట్, ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావుతోపాటు ఇతర రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు అభినందించారు. తనను ఎన్నుకున్న ఆర్టీసీల ఎండీలకు సజ్జనార్ థ్యాంక్స్ చెప్పారు.