పోలీసుల కంటే ఆర్టీసీ ఉద్యోగులే ఎక్కువ కష్టపడ్తరు: సజ్జనార్

పోలీసుల కంటే ఆర్టీసీ ఉద్యోగులే ఎక్కువ కష్టపడ్తరు: సజ్జనార్

పోలీసుల కంటే ఆర్టీసీ ఉద్యోగులే ఎక్కువ కష్టపడుతారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్  అన్నారు. బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ లో జరిగిన రాష్ట్ర స్థాయి ఉద్యోగుల సంక్షేమ మండలి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన సజ్జనార్.. రానున్న రోజుల్లో ప్రేవేట్ రవాణా వ్యవస్థ నుండి తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.వాటికి ధీటుగా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఉద్యోగులను కోరారు. ఉద్యోగుల సంక్షేమమే ఆర్టీసీ సంస్థ ప్రధాన ధ్యేయమని చెప్పారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తామని సజ్జనర్ అన్నారు.  విధి నిర్వహణలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన ఉద్యోగులకు ఎక్స్ ట్రా మైల్ అవార్డులను అందజేసి ఘనంగా సన్మానించారు.

రాష్ట్రంలో తొలిసారిగా స్లీపర్‌ బస్ లను TSRTC ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్‌ నుంచి కాకినాడ, విజయవాడ మార్గాల్లో వాటిని నడపనుంది. కేపీహెచ్‌బీ బస్టాప్ వద్ద బుధవారం సాయంత్రం 4 గంటలకు సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ గారితో కలిసి కొత్త బస్సులను ప్రారంభించనున్నారు.