సమంత నటించిన ఖుషీ(Khushi) మూవీ ట్రైలర్ నిన్న విడుదలై మంచి టాక్ను సొంతం చేసుకుంది. రియల్లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్స్ ఆధారంగా దర్శకుడు శివ నిర్వాణ కథ రాసుకున్నట్టు తెలుస్తోంది. ట్రైలర్లో సమంత కనిపించిన సీన్స్ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటున్నాయి.
కొందరు మనం సినిమాలో సమంత చేసిన క్యారెక్టర్ గుర్తుచేసినట్టుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రం ఈ క్యారెక్టర్తో కనెక్ట్ అవుతున్నారు. తమ కథను చూస్తున్నట్టే ఉందంటున్నారు. ఈ ఎమోషన్ సినిమాలో కూడా వర్కవుట్ అయితే ఇక ఖుషీ హిట్టందుకోవడం పక్కా అంటున్నారు క్రిటిక్స్.
నిన్న జరిగిన ఈవెంట్లో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ సమంత కోసం ఈ సినిమాను పదేళ్లు పోస్ట్ పోన్ చేసేవాళ్లం అని చెప్పి అంచనాలు పెంచేశాడు. దీంతో సమంతను తెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.