ఫ్యామిలీ ఆడియెన్స్​ను పడేసింది

ఫ్యామిలీ ఆడియెన్స్​ను పడేసింది

సమంత నటించిన ఖుషీ(Khushi)  మూవీ ట్రైలర్​ నిన్న విడుదలై మంచి టాక్​ను సొంతం చేసుకుంది. రియల్​లైఫ్​ లో జరిగే ఇన్సిడెంట్స్​ ఆధారంగా దర్శకుడు శివ నిర్వాణ కథ రాసుకున్నట్టు తెలుస్తోంది. ట్రైలర్​లో సమంత కనిపించిన సీన్స్​ ఫ్యాన్స్​ను ఆకట్టుకుంటున్నాయి. 

కొందరు మనం సినిమాలో సమంత చేసిన క్యారెక్టర్​ గుర్తుచేసినట్టుంది అంటూ కామెంట్స్​ పెడుతున్నారు. ఇక ఫ్యామిలీ ఆడియెన్స్ ​మాత్రం ఈ క్యారెక్టర్​తో కనెక్ట్​ అవుతున్నారు. తమ కథను చూస్తున్నట్టే ఉందంటున్నారు. ఈ ఎమోషన్​ సినిమాలో కూడా వర్కవుట్​ అయితే ఇక ఖుషీ హిట్టందుకోవడం పక్కా అంటున్నారు క్రిటిక్స్​. 

నిన్న జరిగిన ఈవెంట్​లో హీరో విజయ్​ దేవరకొండ మాట్లాడుతూ సమంత కోసం ఈ సినిమాను పదేళ్లు పోస్ట్​ పోన్​ చేసేవాళ్లం అని చెప్పి అంచనాలు పెంచేశాడు. దీంతో సమంతను తెరపై చూసేందుకు ఫ్యాన్స్​ ఎదురుచూస్తున్నారు.