పుష్ప 2లో పాత్రపై సమంత క్లారిటీ

పుష్ప 2లో పాత్రపై సమంత క్లారిటీ

సుకుమార్ డైరెక్షన్ లో 2021లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన 'పుష్ప ; ది రూల్' మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమాలోని 'ఊ అంటావా' అనే ఐటెం సాంగ్ విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే 'పుష్ప 2 : ది రైజ్' పేరుతో మూవీ సీక్వెల్ షూటింగ్ ప్రారంభం కాగా.. రీసెంట్ గా హీరో అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మూవీ టీజర్, ఫస్ట్ లుక్ కు భారీ స్పందన వచ్చింది. పార్ట్ 1లో సమంత చేసిన 'ఐటెం సాంగ్'కు భారీ ఫాలోయింగ్ ఏర్పడగా.. ఇప్పుడ సెకండ్ పార్ట్ లోనూ ఆమె పాత్ర ఉండబోతుందా అన్న ప్రశ్న కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చిత్ర నిర్వాహకులు ఆమెను స్పందించినా రిజెక్ట్ చేసిందనే వార్తలూ హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమంత ఈ ప్రచారంపై స్పందించారు. తాను 'పుష్ప 2'లో చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ నటించనున్నారంటూ స్పష్టం చేశారు.

గుణ శేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో ఏప్రిల్ 14న విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్న సమంత లేటెస్ట్ చిత్రం 'శాకుంతలం'. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అందులో భాగంగా స్టార్ హీరోయిన్ సమంత పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంలోనే ఆమె 'పుష్ప 2'లో ఎంట్రీపైనా క్లారిటీ ఇచ్చారు.