ఒకేరోజు ముగ్గురు యువతులు మిస్సింగ్

ఒకేరోజు ముగ్గురు యువతులు మిస్సింగ్

సంగారెడ్డి జిల్లాలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని, ఇద్దరు విద్యార్థినులు కనిపించకుండా పోయారు. వీరిలో పటాన్‌చెరుకు చెందిన ఇద్దరు ఇంటర్‌ విద్యార్థినులు కాగా..మరో యువతి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని. పటాన్‌చెరుకు చెందిన ప్రశాంతి, గాయత్రి స్థానిక ఇంటర్‌ జూనియర్‌ కళాశాలలో చదువుతున్నారు. మంగళవారం ఉదయం ఇద్దరూ కాలేజీకి వెళ్తున్నామని చెప్పి మళ్లీ తిరిగి ఇంటికి రాలేదని వారి తల్లిదండ్రులు తెలిపారు. ఇద్దరు స్నేహితులు ఎక్కడికి వెళ్లారో తెలియక తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో వారు పటాన్‌చెరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పటాన్‌చెరులోని కృషి డిఫెన్స్‌ కాలనీకి  చెందిన శివాని అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అదృశ్యమైంది. మంగళవారం రాత్రి ఆమెను తన స్నేహితుడు కాలనీలో దింపినట్టు సీసీఫుటేజీ ద్వారా తెలిసింది. మంగళవారం రాత్రి నుంచి తన కూతురు కన్పించకుండా పోయిందని శివాని తండ్రి పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.