సికింద్రాబాద్, వెలుగు: చెన్నై షాపింగ్ మాల్లో రూ.5 లక్షల విలువైన చీరలు మాయమైనట్లు ఆడిట్లో తేలడంతో మేనేజర్ మహంకాళి పోలీసులకు కంప్లయింట్ చేశాడు. ప్యాట్నీ సెంటర్లోని చెన్నై షాపింగ్ మాల్లో 10 రోజుల కిందట ఆడిట్ చేయగా.. రూ. 5 లక్షల విలువ చేసే సరుకు తేడా వచ్చింది. మేనేజర్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు.
పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించారు. స్వీపర్స్ చెత్తను బయటకు తీసుకెళ్లే క్రమంలో చీరలను కొట్టేసి చెత్త డబ్బాల్లో బయటకు తీసుకెళ్లినట్లు గుర్తించి దర్యాప్తు చేపట్టారు.