చెన్నై షాపింగ్ మాల్​లో రూ.5 లక్షల చీరలు మాయం

చెన్నై షాపింగ్ మాల్​లో  రూ.5 లక్షల చీరలు మాయం

సికింద్రాబాద్​, వెలుగు: చెన్నై షాపింగ్ మాల్​లో రూ.5 లక్షల విలువైన చీరలు మాయమైనట్లు ఆడిట్​లో తేలడంతో మేనేజర్ మహంకాళి పోలీసులకు కంప్లయింట్ చేశాడు.  ప్యాట్నీ సెంటర్​లోని చెన్నై  షాపింగ్ మాల్​లో  10 రోజుల కిందట ఆడిట్ చేయగా.. రూ. 5 లక్షల విలువ చేసే సరుకు తేడా వచ్చింది. మేనేజర్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు.  

పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించారు. స్వీపర్స్ చెత్తను బయటకు తీసుకెళ్లే క్రమంలో చీరలను కొట్టేసి చెత్త డబ్బాల్లో బయటకు తీసుకెళ్లినట్లు గుర్తించి దర్యాప్తు చేపట్టారు.