సర్పంచ్ అవమానించాడని.. యువకుడి ఆత్మహత్య

సర్పంచ్ అవమానించాడని.. యువకుడి ఆత్మహత్య

దుబ్బాక, వెలుగు: గ్రామపంచాయతీ భనవ సముదాయంలో తనకు షెటర్ ‌‌‌‌ఇవ్వలేదని, సర్పంచ్ ‌అవమానించాడని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు కుటుంబసభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రానికి చెందిన బక్కొల్ల మధుసూదన్ రెడ్డి(21) ఈ నెల 25వ తేదీన గ్రామపంచాయతీ దుకాణ భవన సముదాయంలో తనకు షెటర్‌‌‌ కావాలని సర్పంచ్ ‌కొండల్ ‌‌రెడ్డిని కోరారు. అయితే సర్పంచ్ షెటర్ ‌‌‌‌ఇవ్వకుండా అసభ్యకరంగా మాట్లాడుతూ అవమాన పరిచాడు. దీంతో మనస్తాపానికి గురైన మధుసూదన్‌రెడ్డి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు హైదరాబాద్‌ తీసుకెళ్ల‌గా బుధవారం చనిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.