మానసిక రోగిని తాళ్లతో కట్టేసి చితకబాదిన సర్పంచ్ కొడుకు

మానసిక రోగిని తాళ్లతో కట్టేసి చితకబాదిన సర్పంచ్ కొడుకు

నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ లో ఓ వ్యక్తిని చితకబాదాడు సర్పంచ్ కొడుకు శ్రీను. లింగాపూర్ గ్రామానికి చెందిన రాజు మానసిక పరిస్థితి బాగాలేని ఓ రోగి. ఇతని ఇంటి పక్కనే సర్పంచ్ ఇల్లు ఉంది. ఓ మహిళ పట్ల రాజు అసభ్యంగా ప్రవర్తించాడని.. కోపంతో ఊగిపోయిన సర్పంచ్ కొడుకు శ్రీను.. రాజును తాళ్లతో కట్టేసి కొట్టాడు. అందరూ చూస్తుండగానే చితకబాదాడు. సర్పంచ్ కుమారుడికి ఆ మహిళతో అక్రమ సంబంధం ఉందని అంటున్నారు స్థానికులు. మానసిక పరిస్థితి బాగాలేని రాజు.. ఆమెను తిట్టడం వల్లనే శ్రీను కొట్టాడని చెప్తున్నారు. దెబ్బలు తిన్న రాజును హాస్పిటల్ కు తరలించారు. మరోవైపు రాజు మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు సర్పంచ్ కుమారుడు.

రెడ్ స్టేట్స్ బ్లూ స్టేట్స్ లేవు.. అంతా యునైటెడ్ స్టేట్స్