
- బ్యాంకు అకౌంట్లో అడ్రస్ తప్పు ఉందంటూ మోసం
బషీర్బాగ్, వెలుగు: బ్యాంక్ ఖాతాకు లింకుగా ఉన్న అడ్రస్ తప్పుగా ఉందని నమ్మించి సైబర్ నేరగాళ్లు ఓ ప్రభుత్వ ఉద్యోగిని బురిడీ కొట్టించారు. అతడి అకౌంట్లో ఉన్న రూ.3 లక్షల 92 వేలు మాయం చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 59 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగికి ఎస్ బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్ పేరుతో స్కామర్లు కాల్ చేశారు. మీ అకౌంట్ కు లింక్ చేయబడిన అడ్రస్ తప్పుగా ఉంది, దానిని సరిచేయలని నమ్మించారు.
డేట్ ఆఫ్ బర్త్ , అడ్రస్ ప్రూఫ్ లను తెలుసుకున్నారు. అనంతరం సదరు ఉద్యోగి మొబైల్ నెంబర్ కు ఏపీకే ఫైల్ పంపించారు. దానిని ఓపెన్ చేయగానే మొబైల్ స్విచాఫ్ అయింది. కాసేపటికి స్విచ్ ఆన్ చేయగానే ఉద్యోగి అకౌంట్ నుంచి మొత్తం రూ.3,92,903 డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానని గుర్తించి బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఆన్లైన్లో ఫిర్యాదు చేశాడు.