స్కూల్స్​ రీ ఓపెన్ పై విద్యాశాఖ క్లారిటీ

స్కూల్స్​ రీ ఓపెన్ పై విద్యాశాఖ క్లారిటీ

తెలంగాణలో కోవిడ్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.శుక్రవారం ఒక్కరోజే 155 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలు తెరుచుకోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. తెలంగాణలో స్కూల్స్‌ రీఓపెన్‌ పై ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే ఈ నెల 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని స్పష్టం చేసింది. సెలవుల పొడిగింపు లేదని ఉన్నతాధికారులు తెలిపారు.