మెరిసిన అవనీష్​.. కుర్రాళ్ల గెలుపు

మెరిసిన అవనీష్​.. కుర్రాళ్ల గెలుపు

జొహనెస్‌‌‌‌బర్గ్‌‌‌‌: టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో దుమ్మురేపిన ఇండియా అండర్‌‌‌‌–19 కుర్రాళ్లు.. ట్రై నేషన్‌‌‌‌ టోర్నీలో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. అర్షిన్‌‌‌‌ కులకర్ణి (106 బాల్స్‌‌‌‌లో 12 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌లతో 91, 2/53) ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోకు తోడు తెలంగాణ కుర్రాడు  అరవెల్లి అవనీష్‌‌‌‌ (60 నాటౌట్‌‌‌‌), ఆదర్ష్‌‌‌‌ సింగ్‌‌‌‌ (66) ఫిఫ్టీలతో మెరవడంతో మంగళవారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఇండియా 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది.

 టాస్‌‌‌‌ ఓడిన ప్రొటీస్‌‌‌‌ 46.1 ఓవర్లలో 240 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. ప్రిటోరియస్‌‌‌‌ (67), స్టీవ్‌‌‌‌ స్టోల్స్‌‌‌‌ (46) రాణించారు. ఆరాధ్య శుక్లా 4, సౌమీ పాండే 3, అర్షిన్‌‌‌‌ కులకర్ణి 2 వికెట్లు తీశారు. తర్వాత ఇండియా 40.5 ఓవర్లలోనే 244/3 స్కోరు చేసి నెగ్గింది.  గురువారం జరిగే లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఇండియా.. అఫ్గానిస్తాన్‌‌‌‌తో తలపడుతుంది. ప్రస్తుతం టీమిండియా 4 పాయింట్లతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో కొనసాగుతోంది.