ప్రధానిగా మోదీ హ్యాట్రిక్​ కొట్టడం పక్కా : కిషన్​రెడ్డి

ప్రధానిగా మోదీ హ్యాట్రిక్​ కొట్టడం పక్కా : కిషన్​రెడ్డి

సికింద్రాబాద్, వెలుగు: ప్రధానిగా నరేంద్ర మోదీ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్​రెడ్డి చెప్పారు. బీజేపీ దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన మెట్టుగూడ, అడ్డగుట్ట, లాలాగూడ రైల్వే వర్క్ షాప్ వద్ద పర్యటించారు. లాలాగూడ రైల్వే వర్క్ షాప్ వద్ద గేట్ మీటింగ్ లో రైల్వే ఉద్యోగులను కలిసి మాట్లాడారు.

మోదీ నాయకత్వాన్ని రైల్వే ఉద్యోగులు బలపరచాలని విజ్ఞప్తి చేశారు. తనను సికింద్రాబాద్ నుంచి మరోసారి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం అడ్డగుట్ట పరిధిలోని సాయి నగర్, చంద్రశేఖర్ నగర్ తదితర బస్తీల్లో కిషన్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఓటర్లను కలుసుకొని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఆయన వెంట మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ గౌడ్, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.