- సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్
సికింద్రాబాద్, వెలుగు : ప్రజా రంజకమైన పరిపాలనను అందించడంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఫెయిల్అయ్యాయని సికింద్రాబాద్బీఆర్ఎస్ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ విమర్శించారు. ప్రజా సమస్యలను పట్టించుకోని ప్రభుత్వాలను నిలదీసేందుకు బీఆర్ఎస్ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని బాపూజీ నగర్, పార్సిగుట్ట ప్రాంతాల్లో పద్మారావు గౌడ్ శనివారం విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. బీజేపీ నాయకులు మతతత్వ రాజకీయాలతో ప్రజలను విభజిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ఏకమై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను తిప్పికొట్టాలని, ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. ఆయన వెంట ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డి, యువ నేతలు ముఠా జైసింహ, రామేశ్వర్ గౌడ్ ఉన్నారు.